తెలంగాణా కరోనా అప్డేట్ : 1,456 కేసులు, 5 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,456 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,27,580 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 5 గురు మరణించారు. ఇప్పటి వరకు 1,292 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 20,183గా ఉన్నాయి. వారిలో 16,977 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,06,105 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,717 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 90.56% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 89.2% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.56%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 38,565 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 39,78,869 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 235 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version