తెలంగాణాలో కరోనా అప్డేట్.. 1682 కేసులు, 8 మరణాలు ?

-

తెలంగాణలో నిన్న కాస్త తగ్గినట్టు అనిపించిన కరోన కేసులు మళ్ళీ పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 1682 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఒక బులెటిన్ లో ప్రకటించింది. ఈ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 93937కి చేరింది. ఇక 24 గంటల్లో కరోనా బారిన పడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని బులెటిన్ లో పేర్కొన్నారు. ఆ లెక్కన ఇప్పటి వరకు 711 మరణాలు తెలంగాణలో నమోదయ్యాయి.

తెలంగాణాలో కరోనా అప్డేట్.. 1682 కేసులు, 8 మరణాలు ?
ఇక బులెటిన్ ప్రకారం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,024గా ఉంది హోం ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు 14,140 మంది, ఇక నిన్న ఒక్కరోజే తెలంగాణలో 19579 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి 72, 702 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. దీంతో తెలంగాణలో రికవరీ రేటు 76.87 శాతానికి పెరిగింది. ఇది కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పచ్చు. ఇక ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో 235 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version