తెలంగాణా కరోన అప్డేట్.. 2,123 కేసులు, 9 మరణాలు !

-

తెలంగాణా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తెలంగాణాలో గత 24 గంటల్లో మరోసారి 2 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 2,123 కేసులు నిన్న నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,69,169 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 9 మంది మరణించారు. ఇప్పటి వరకు ఒక 1025 మంది మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,636 గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,37,508 పైగా మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 81.28 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 79.26 శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.60 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 54,459 పరిక్షలు చేస్తే ఇప్పటి వరకు 24,34,409 23 లక్షల 79 వేల పరీక్షలు చేసారు. నిన్న ఒక్క రోజే 2,151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 305 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news