తెలంగాణా కరోనా : 837 కేసులు, నాలుగు మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే రోజూ చేసే కరోనా టెస్ట్ ల కంటే చాలా మేరకు టెస్ట్లు తగ్గించడంతో కేసులు కూడా భారీగా తగ్గాయి. అయితే మొన్నటి మీద ఎక్కువే నమోదయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 837 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,32,671 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో నలుగురు మరణించారు. ఇప్పటి వరకు 1315 మంది కరోనాతో మరణించారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 17,890 ఉన్నాయి. వారిలో 14,851 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,13,466 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,554 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 91.14% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 90.3% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.56%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 21099 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 41,15,516 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 174 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news