బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ కసరత్తు…భారీగా పెరగనున్న పింఛన్లు !

-

వచ్చే నెల తొలి వారంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ ఆర్థికశాఖ కసరత్తు కొనసాగుతోంది. ఉద్యోగుల వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయానికి సంబంధించిన పొద్దు ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ఇతర సంబంధించిన ప్రగతి పెద్ద కసరత్తు కొనసాగుతోంది.

ఉద్యోగుల వేతన సవరణ అలాగే కొత్త ఉద్యోగాల నియామకానికి అవసరమైన మొత్తాన్ని నిర్వహణ పద్దు లో సర్దుబాటు చేసినట్లు సమాచారం. అలాగే 2022-23 లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా… ఆయా శాఖలు, సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాలకు కేటాయింపులు చేయనున్నారు.

కొత్త పింఛన్లు దారులను చేర్చుకుని నేపథ్యంలో… వారి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు పెరిగే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో వారి కోసం బడ్జెట్లో పెంచే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలకు కూడా బడ్జెట్ ను సర్దుబాటు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version