కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ మరో లేఖ..

-

కృష్ణా బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మరో లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం మాత్రమేనని… దాని నుండి కృష్ణా బేసిన్ ఆవలకు నీటి మల్లింపును ట్రిబ్యునల్ అనుమతించలేదని ఈ లేఖలో పేర్కొన్నారు. HNSS ప్రాజెక్టు నుండి బేసిన్ ఆవలకి నీటి తరలింపు వల్ల బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్ట పోతాయని పేర్కొన్నారు.

నది ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాల ను కాదని బేసిన్ ఆవల 700 కిలోమీటర్ల దూరంలో నీటిని తరలించడం చాలా అన్యాయమని లేఖలో వెల్లడించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుంగభద్ర హై లెవెల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్ ఆవలికి మళ్ళిస్తాయి కాబట్టి కేటాయింపులు చేయడం లేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం HNSS ప్రాజెక్టు ద్వారా TBHLC ప్రాజెక్టు కంటే ఆవలకు తీసుకుని వెళ్ళడం ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. మిగుల జలాల పై బేసిన్ ఆవల కు తీసుకెళ్లే HNSS ప్రాజెక్టునే వ్యతిరేకిస్తూ ఉంటే, ఇప్పుడు HNSS ను 3850 క్యూసెక్కుల నుండి 6300 క్యూసెక్కుల కు పెంచడం అక్రమమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version