రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణా హైకోర్ట్ శుభవార్త

-

రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణా హైకోర్ట్ శుభవార్త చెప్పింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు విషయంలో ఈనెల 10 వరకు స్టే పొడిగించారు. ధరణి నిబంధనలకు సంబంధించిన 3 జీవోలపై న్యాయవాది గోపాల్ శర్మ మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. ధరణి జీవోల పై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏజీ కోరారు.

ధరణిపై మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఏజీ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించ లేదని పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చునని హైకోర్టు  సూచించింది. అయితే సేకరించిన డేటాకు చట్టబద్ధతమైన భద్రత ఉండాలసిందేనని హైకోర్టు పేర్కొంది. అలానే ధరణిపై విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది తెలంగాణా హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version