తెలంగాణ మంత్రులు అవినీతి లో కురుకుపోయారు : పురంధేశ్వరి

-

తెలంగాణ మంత్రులు అవినీతి లో కురుకుపోయారు అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల పాలన కావాలా? స్వీయ పరిపాలన కావాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..అది బీజేపీ తోనే సాధ్యం అన్నారు.

తెలంగాణలో నాయకులు, మంత్రులు అవినీతి లో కురుకుపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమైంది అని తెలిపారు. నీళ్లు నిధులు నియామకాలు విషయంలో ఈ ప్రభుత్వం ఎం చేసిందో అందరికి తెలుసు.. ఏ పార్టీ కి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు గమనించాలి. మా పొత్తు ఉన్నది జనసేన తో మిగిలిన విషయాలు హై కమండ్ చూసుకుంటుంది.కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఒక కమ్యూనిటీ కి సంబంధించినట్టుగా ఉందన్నారు. భూములు కూడా అమ్ముతాం అంటున్నారు అది కరెక్ట్ కాదు అని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. పేదలకు మేలు జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news