వరద బాధితులకు తెలంగాణ పోలీసుశాఖ భారీ విరాళం!

-

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వరదలు సంభవించి పలు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. ఇళ్లలోకి నీరు చేరడంతో చాలా మంది ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వస్తువులు, చిన్నారుల పుస్తకాలు, బ్యాంకు బుక్కులు అన్ని తడిచిపోగా వాటిని అరబెట్టుకుంటున్న దృశ్యాలను సైతం చూసే ఉంటాం. అదేవిధంగా భారీ స్థాయిలో పంట, ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు.

అయితే, ప్రభుత్వం పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్ధం ప్రముఖులు, సెలబ్రీటీలు, నేతలు, ప్రజలు సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తెలంగాణ పోలీసులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ పోలీసుల తరపున సీఎం సహాయనిధికి రూ.11,06,83,571ల భారీ విరాళం అందించారు.తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ చెక్‌ను అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news