Telangana : రేపు పాలిసెట్ ఫలితాల విడుదల

-

పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ప్రతి సంవత్సరం పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తుంటారు. మే 24న పాలిసెట్ రాత పరీక్ష జరగగా ఇటీవలె మూల్యాంకనం కూడా పూర్త అయ్యింది.ప్రస్తుతం, ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రిజల్ట్స్ విడుదలకు సంబంధించి వివరాలను అధికారులు వెల్లడించారు.

 

జూన్ 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఐఏఎస్‌, తెలంగాణ ఎస్‌బీటీఈటీ ఛైర్మన్‌ శ్రీ బి. వెంకటేషం, ఎస్‌బీటీఈటీ ఎస్‌.వీ భవన్‌, మాసబ్ ట్యాంక్‌, హైదరాబాద్‌లో పాలిసెట్ 2024 ఫలితాలను రిలీజ్ చేస్తారు.కాగా.. మే 24న మొత్తం 49 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పాలిసెట్ రాత పరీక్ష నిర్వహించారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో టిసిఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ,కర్నూలుపట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news