త్వరలో సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్

-

తెలంగాణ సింగరేణి కార్మికులకు అదిరిపోయే శుభవార్త అందింది. నిన్న దసరా మరియు దీపావళి బోనస్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాయి రోజు మరో శుభవార్త అందింది. సింగరేణి కార్మికులకు త్వరలోనే 700 కోట్ల బోనస్ చెల్లిస్తామని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ కీలక ప్రకటన చేశారు.

2013 నుంచి 2014 సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాలు 419 కోట్లుగా ఉండగా… ఈ ఏడాది 2222 కోట్ల లాభాలను అర్జించిందని సిఎండి శ్రీధర్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మరో 12 కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించామని… వాటిలో నాలుగింటిని ఈ డిసెంబర్లో ప్రకటించబోతున్నట్లు ప్రకటించారు.

అటు సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు సీఎం కేసీఆర్. అలాగే సింగరేణి కార్మికులకు దసరా మరియు దీపావళి బోనస్గా 1000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని కీలక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news