వైద్యుల నిర్లక్ష్యం..హన్మకొండలోని డాల్పిన్ హాస్పిటల్ లో 8 ఏళ్ల చిన్నారి మృతి !

-

హన్మకొండలోని డాల్పిన్ హాస్పిటల్ లో 8 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. హన్మకొండ లోని డాల్పిన్ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 8 సంవత్సరాల పాప సాయి శ్రీ మృతి చెందిందని సమాచారం. హన్మకొండ లోని డాల్పిన్ హాస్పిటల్ నందు ఈ నెల తొమ్మిదవ తేదీన జ్వరం వచ్చిందని అడ్మిట్ చేశారు తల్లిదండ్రులు.

8 year old baby Sai Sri died due to negligence of doctors in Hanmakonda Loni Dolphin Hospital

అయితే.. 8 సంవత్సరాల పాప సాయి శ్రీకి డెంగ్యూ ఫీవర్ అని చెప్పి ట్రీట్మెంట్ చేశారు వైద్యులు. దీంతో ఒక రోజు ముందు పాప ఆరోగ్యం నిలకడగానే ఉంది ఎలాంటి భయం వద్దు అని హామీ ఇచ్చారు డాక్టర్లు. కానీ తల్లిదండ్రులు వెళ్లి పాపను చూస్తే చనిపోయిందని తెలిసింది. దీంతో డాక్టర్లు పట్టించుకోలేదని అందువల్లనే తమ పాప చనిపోయిందని హాస్పిటల్ ఎదుట పాప తరఫున బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version