తెలంగాణలో 91 మంది ఐపీఎస్‌ల బదిలీ

-

తెలంగాణలో 91 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీఎం కేసీఆర్‌ బుధవారం సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో కసరత్తు చేసి అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పలుమార్లు బదిలీలు జరిగినా పెద్దఎత్తున ఎస్పీలను మార్చడం ఇదే తొలిసారి. గత నెలాఖరున డీజీపీ పదవీవిరమణ నేపథ్యంలో ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి.

డీజీపీగా అంజనీకుమార్‌ను నియమించడంతో పాటు అయిదారేళ్ల వరకు ఒకే స్థానంలో పనిచేసిన ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగించారు. ఆ సమయంలో డీఐజీ నుంచి డీజీపీ స్థాయి వరకు గల ఉన్నతాధికారులను మార్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఎస్పీ, ఆ పై స్థాయి అధికారులపై దృష్టి సారించింది. ఎన్నికల సంవత్సరం కావడంతో తాజా బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రధానంగా రాష్ట్రంలో మూడు కమిషనరేట్లకు కొత్త కమిషనర్లు నియమితులయ్యారు. కరీంనగర్‌, రామగుండం, ఖమ్మం కమిషనర్లుగా సుబ్బారాయుడు, రెమా రాజేశ్వరి, సురేశ్‌కుమార్‌లను నియమించారు. నల్గొండ, వనపర్తి, ములుగు, సిరిసిల్ల, గద్వాల, జగిత్యాల ఎస్పీలు కొత్తగా కొలువుదీరారు.

Read more RELATED
Recommended to you

Latest news