మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులో ప్రమాదం.. నలుగురు మృతి

-

సంక్రాంతి పండుగపూట మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబాలపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి కారు-ఆటో ఢీకొని నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒకే కుటుంబంలోని తల్లి, కుమారుడు, మనవడు, మనవరాలు అని పోలీసులు గుర్తించారు.

A terrible accident in AP Three youths died

మృతులు శ్రీను, పాప, రిత్విక, రిత్విక్‌ అని పోలీసులు తెలిపారు. వీరంతా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ వాసులు అని వెల్లడించారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలైనట్లు చెప్పారు. మహబూబాబాద్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నట్లు వివరించారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగంతో కారు నడిపి ఆటోను ఢీకొట్టినట్టు సమాచారం. పండుగ వేళ ఊరంతా సందడిగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా చనిపోవటంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.

Read more RELATED
Recommended to you

Latest news