తెలంగాణ భవన్ లో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ మధ్య గొడవ ?

-

తెలంగాణ భవన్ లో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ మధ్య గొడవ చోటు చేసుకుంది. తెలంగాణ భవన్ లో చేవెళ్ల BRS పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. అయితే.. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. అయితే.. ఈ సమావేశంలో మాట్లాడేందుకు సిద్ధమైన మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది.

A fight between Mahender Reddy and pilot Rohit in Telangana Bhavan

మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడటాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు పైలెట్ రోహిత్ రెడ్డి వర్గీయులు. మహేందర్ రెడ్డి కి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వవద్దని అడ్డుకున్నారు రోహిత్ రెడ్డీ వర్గీయులు. అయితే.. ఈ గొడవపై మాజీ మంత్రి హరీష్‌ రావు సీరియస్‌ అయ్యారు. తెలంగాణ భవన్ లో తాండూరు నేతలు మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. సమీక్ష సమావేశం లో ఇరు వర్గాల మధ్య గొడవ జరగడం తో వారితో మాట్లాడుతున్నారు హరీష్ రావు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news