జగిత్యాల జిల్లాలో దారుణం.. తాగిన మైకంలో భార్యను కడతేర్చిన భర్త..!

-

తాగిన మైకంలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన విషాధ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది. ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రజిత (38)ను మారేడుపల్లి గ్రామానికి చెందిన పున్నంరెడ్డికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహానంతరం కొన్నాళ్ల పాటు వారి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. వారి కాపురానికి ప్రతీకగా 11 ఏళ్ల పాప కూడా ఉంది.

గత కొంతకాలంగా పున్నంరెడ్డి విపరీతంగా తాగుడుకు బానిసయ్యాడు. దీంతో నిత్యం ఇంట్లో భార్యభర్తలకు గోడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన పున్నంరెడ్డి భార్యతో రజితతో గొడవపడ్డారు. ఇరువురి మధ్య మాట మాట పెరిగడంతో.. సహనం కోల్పోయిన భర్త పున్నంరెడ్డి భార్య రజిత తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో రజితకు తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునిని ధర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news