ఆ మూడు ఎంపీ సీట్లు గెలవడం కాంగ్రెస్ పార్టీకి అసాధ్యం : కేటీఆర్

-

కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లోకి వెళ్లారని విమర్శించారు. అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని అన్నారు. తెలంగాణ భవన్ లో బుధవారం చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు.

లోక సభ ఎన్నికల కార్యచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఎంపీ అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్లో తీవ్రమైన అయోమయంలో ఉందని అన్నారు. చేవేళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అసాధ్యమని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేవేళ్లలో ఏప్రిల్ 13న భారీ బహిరంగా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేవేళ్ల సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news