హైదరాబాద్‌ లో విషాదం..ఓ ప్రేమ జంట ఆత్మహత్య

-

హైదరాబాద్‌ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.పి.హెచ్.బి కాలనీ 7వ ఫేజులో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. స్నేహితుడి గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు ప్రేమికులు శ్యాం, జ్యోతి.

భీమవరం గొల్లవాని తిప్ప కు చెందిన ఇద్దరు కొద్ది రోజుల క్రితం స్నేహితుడి గదికి వచ్చారు. స్నేహితుడు వివాహం ఉంది అంటూ బయటకు వెళ్ళిన సమయంలో ఆత్మహత్య చేసుకుంది ఈ ప్రేమికుల జంట. ఇక ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news