సిద్దిపేట జిల్లాలో గంజాయి చాక్లెట్ ల కలకలం

-

సిద్దిపేట జిల్లాలో గంజాయి చాక్లెట్ ల కలకలం రేగింది. సిద్ధిపేట చేర్యాలలోని ఓ కాలేజీ సమీపంలోని పాన్ షాపు నిర్వహకుడి నుంచి గంజాయి చాక్లెట్ లను పట్టుకున్నారు పోలీసులు. బీహార్ కు చెందిన రాకేష్ కుమార్ బీహార్ నుంచి చాక్లెట్ లు తెచ్చి బిహారీ కూలీలకు అమ్ముతున్నటు గుర్తించారు పోలీసులు.

A mixture of ganjai chocolates in Siddipet district

90 వేల రూపాయలు విలువ గల 1200 చాక్లెట్ లను స్వాధీనం చేసుకుని పాన్ షాప్ నిర్వాహకుడు రాజేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా,

రెండు రోజుల కిందట రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లేట్స్ గుట్టు రట్టు అయింది. 4 కేజీల గంజాయి చాక్లేట్స్ సీజ్ చేసిన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. కోకాపేట్ రాంకీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వద్ద అధికారుల దాడులు.

ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కు చెందిన గంజాయి చాక్లెట్స్ గుర్తించారు. ఒడిస్సా కు చెందిన సౌమ్యా రాజన్ అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. ఒడిస్సా నుంచి గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయించారు. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news