కేటీఆర్ బామ్మర్ధి ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ.. 42 మందికి పరీక్షలు !

-

జన్వాడలో ఓ ఫామ్ హౌస్ లో VIP ల రేవ్ పార్టీ భగ్నం చేశారు సైబరాబాద్ SOT పోలీసులు. డీజే సౌండ్స్ తో హోరేత్తిన పార్టీలో డ్రగ్స్‌ వాడినట్లు సమాచారం. అంతేకాదు… భారీగా విదేశీ మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ పార్టీ లో పాల్గొన్న వ్యక్తులకు టెస్టులు చేస్తున్నారట పోలీసులు. కేటీఆర్ బామ్మర్ధి రాజ్ పాకాల పాం హౌజ్ అని పోలీసులు చెబుతున్నారు. రాజ్ పాకాల ఫాం హౌస్ లో పాల్గొన్న వాళ్ళ కి డ్రగ్స్ టెస్ట్ చేసిన పోలీసులు..షాకింగ్‌ నిజాలు తేల్చింది.

డ్రగ్స్ పార్టీ లో పాల్గొన్న ఒక వ్యక్తికి కోకయున్ డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ తరునంలోనే కేటీఆర్ బావమరిదిపై కేసు నమోదు చేశారట పోలీసులు. పోలీసులు రాకముందే, ఓ కీలక నేత అక్కడి నుండి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు..కీలక నేత సన్నిహితుడు విజయ్ మద్దూర్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. జన్వాడలో ఓ ఫామ్ హౌస్ లో VIP ల రేవ్ పార్టీ లో 42 మంది పాల్గొన్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version