బాసర ట్రిపుల్ ఐటీ లో మరో విద్యార్థి మృతి

-

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో మరో విద్యార్థి మృతి చెందింది. ఆర్జీయూకేటీ బాసరలో పియుసి ప్రథమ సంవత్సరం చదువుతున్న బూర లిఖిత ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాలికల వసతి గృహం 4 వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందికి జారి పడింది లిఖిత.

అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రధమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతి చెందిన విద్యార్థిని స్వస్థలం సిద్ది పేట జిల్లా గజ్వెల్ గా పోలిసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version