నిజామాబాద్ లో దారుణం..ప్రైవేట్ బస్సు ఆపి..13 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగుడు

-

నిజామాబాద్ లో దారుణం జరిగింది. ప్రైవేట్ బస్సు ఆపి..13 లక్షలు ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. ఈ సంఘటన ఆది వారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు లో చోరీ జరిగింది. సారాంగాపుర్ డైరీ ఫారం వద్ద చాయ్ కోసం బస్సును ఆపినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.

A thug who stopped a private bus and stole 13 lakhs

పార్కింగ్ చేసిన బస్సు లో చొరబడి నగదు చోరీకి పాల్పడ్డాడు. ముంబై నుంచి జగిత్యాల వెళ్తుండగా నగర శివారులో ఈ చోరీ ఘటన జరిగింది. బస్సు లో సీసీ కెమెరా కు చేయి అడ్డుపెట్టి చోరికి పాల్పడ్డాడు దుండగుడు. బస్సులో ప్రయాణించే వ్యక్తులు చోరీ చేశారా..? బయట వ్యక్తులు చోరీ చేశారా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news