ఆ ఫేక్ ప్రచారాన్ని భోగి మంటల్లో విసరడం మర్చిపోయాం : హనుమాన్ టీమ్

-

‘హనుమాన్‌’ మూవీ ఓవైపు ప్రేక్షకుల మనసు గెలవడమే కాకుండా మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ సినిమాపై ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు కొంతమంది ఈ చిత్రంపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Special poster from Hanuman

నకిలీ ప్రోఫైల్స్‌ ఎక్కువయ్యాయని వాటిని నిన్న భోగి మంటల్లో విసరడం మర్చిపోయానని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. తమ టీమ్‌ నెగెటివ్‌ ప్రచారాన్ని ఎదుర్కొంటోందని.. ఏదేమైనా ధర్మం కోసం నిలబడేవారు ఎప్పటికీ గెలుస్తారనేది తమ నమ్మకం అని అన్నారు. దాన్ని నిజం చేస్తూ ప్రేక్షకులు తిరుగులేని మద్దతు అందించారని.. వాళ్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సినిమాపై వచ్చే ఇలాంటి ప్రతికూలతలను అణచివేసి.. ఈ సంక్రాంతికి హనుమాన్‌ గాలిపటం మరింత ఎత్తుకు ఎగరడానికి సిద్ధంగా ఉంది’ అని ట్వీట్లో రాసుకొచ్చారు. అలాగే ఈ విషయంపై హీరో తేజ సజ్జా కూడా పోస్ట్‌ పెట్టారు. ‘ఫేక్‌ అకౌంట్‌లను నమ్మకండి.. ఇలాంటి చెత్తను భోగి మంటల్లో కలిపేయండి’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news