భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన భార్య.. కారణం ఏంటంటే..?

-

సాధారణంగా భర్త పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూస్తే ఏ భార్యా సహించదు. అలాంటిది మరొక అమ్మాయి తో పెళ్లి అంటే ఊరుకుంటుందా..? కానీ ఆమె దగ్గరుండి మరీ భర్తకు రెండో వివాహం చేసింది. తన భర్తను ఇష్టపడిన ఓ మానసిక వికలాంగురాలికి భార్య తన భర్తతో వివాహం జరిపించింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మార్కండేయ దేవాలయంలో జరిగింది.

ఈ పెళ్లికి వచ్చిన వారంతా మొదట ఆశ్చర్యపోయినప్పటికీ.. ఆ తర్వాత పెద్ద మనసుతో ఆ భార్య త్యాగాన్ని అభినందించారు. జిల్లా కేంద్రంలోని గూడూరు గ్రామానికి చెందిన సురేష్ – సరితలకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ జంటకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరి సంసారం హాయిగా గడిచిపోతున్న సమయంలో మహబూబాబాద్ పట్టణానికి చెందిన పద్మ – వీరస్వామి దంపతుల చిన్న కుమార్తె సంధ్య తనకి ఊహ తెలిసినప్పటినుండే సురేష్ ని ప్రేమిస్తుంది.

సంధ్య ఓ మానసిక వికలాంగురాలు. సంధ్య తన భర్త సురేష్ ని ప్రేమిస్తుందని సరిత కి తెలిసింది. అయితే సంధ్య మనసు అని అర్థం చేసుకున్న సరిత తన భర్తకు సంధ్యకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. అంతేకాదు వీరి పెళ్లికి సరితే బంధువులను ఆహ్వానించింది. ఆమె దగ్గరుండి వీరి పెళ్లి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news