డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి జరిమానా భయంతో యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రానికి చెందిన ఇరుకు గోపి (25) అనే యువకుడు, ఏడాది క్రితం ఖమ్మం ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తన భార్య కొత్తగూడెంలో నర్సింగ్ కోర్సు చేస్తుండడంతో, అక్కడే నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు గోపి.

ఇటీవల మద్యం సేవించి బండి నడపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడడంతో, అతనికి ఫోన్ చేసి కోర్టులో హాజరు కావాలని, జరిమానా కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు పోలీసులు. దీంతో భయాందోళనకు గురయ్యి, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు గోపి. ట్రాఫిక్ పోలీసుల బెదిరింపుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడ ని పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య.