పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ రియాక్టు అయ్యారు. కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్టు, దుర్మార్గమైన చర్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ పేర్కొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టే కౌశిక్ రెడ్డిపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం… పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని వెల్లడించారు. రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నదని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నడు… కేసులు, అరెస్టులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు అని ఆగ్రహించారు.