మంచిర్యాల జిల్లాలో విషాదం.. సెల్ ఫోన్ బాగుచేయించడం లేదని యువతి ఆత్మహత్య..!

-

పాడైన తన మొబైల్ ఫోన్ ని బాగు చేయించడం లేదంటూ తీవ్ర మనస్తాపంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలోని వేలాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా, ఇటీవలే కూతురు సాయి సుమ (19) వాడే మొబైల్ ఫోన్ కొద్ది రోజుల క్రితం పాడైపోయింది. ఇప్పటికే ఫోన్కు పూర్తిగా అడిక్ట్ అయిన సాయి సుమ ఫోన్ వాడుకుండా ఉండలేకపోయింది.

ఇంతకు ముందు చాలాసార్లు మొబైల్ ఫోన్ను బాగు చేయించినా.. తరచూ ఫోన్ చేస్తున్నావంటూ తల్లి సారక్క కూతురును మందలించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, కొద్ది రోజుల తరువాత ఫోన్ బాగు చేయిస్తానంటూ సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి సుమ ఇంట్లో తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news