నాంపల్లిలో బిజెపి కార్యాలయాన్ని ముట్టడించిన ఆప్ నాయకులు

-

ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ ఎనిమిది గంటల పాటు విచారించింది. ఆ తరువాత సిసోడియాను అరెస్టు చేసింది. లిక్కర్ పాలసీని రూపొందించడంలో సిసోడియా కీలకపాత్ర పోషించాడు. అయితే స్కామ్ కి సంబంధించి బ్యూరోక్రాట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిసోడియాను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.

అయితే సిసోడియ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. ర్యాలీగా వచ్చిన ఆప్ నాయకులు బిజెపి కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆప్ తెలంగాణ శాఖ కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ సుధాకర్ తో పాటు పలువురు ఆప్ నాయకులను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version