హనుమకొండలో విషాదం..ట్రాక్టర్- బైకు ఢీ..ఇద్దరు మృతి

-

 

హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో రాత్రి ట్రాక్టర్ బైకు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పుట్టినరోజు వేడుకలు అని ఇంట్లో నుంచి మృతి చెందిన వారిలో ఒకరైన ఓ యువకుడు బయటకు వెళ్లాడు. వంగపల్లి గ్రామం చెందిన శివ అనే యువకుడు స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటానని ఇంట్లో నుంచి వెళ్లి రోడ్ ప్రమాదంలో మృతి చెందాడు.

A terrible accident in AP Three youths died
accident in hanumakonda

మనకు వేడుకలు వద్దని, పండుగ పూట బయటకు వెళ్ళద్దని వారించిన కూడా స్నేహితులని కలిసి వస్తానని చెప్పి ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లాడని మృతుడి తండ్రి రోదిస్తూ తెలిపాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే శివకుమార్ మృతి చెందగా అతని స్నేహితుడు అరుణ్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు తరలించగా ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా వారి ఇండ్లలో పండుగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news