ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: బాబూమోహన్‌

-

సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం రోజున నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం వరంగల్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్న ఆయన నడుము నొప్పితో బాధ పడగా సిబ్బంది వీల్‌ ఛైర్‌ ఏర్పాటు చేసి లోనికి పంపారు. రిటర్నింగ్‌ అధికారికి బాబు మోహన్ నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

అనంతరం బయటకు వచ్చిన బాబు మోహన్ను మీడియా ప్రతినిధులు.. కేఏ పాల్‌ ప్రజాశాంతి పార్టీ నుంచి నామినేషన్‌ వేస్తారనే ప్రచారం జరిగిందని ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. కేఏ పాల్‌ కాఫీకి రమ్మంటే వెళ్లానని, అక్కడ పాల్‌ తనకు కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారని చెప్పారు. అయితే తాను దానికి ఒప్పుకోలేదని, తాను ఎలాంటి పార్టీ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. అదే రోజు ఆ పార్టీకి టాటా బైబై చెప్పానని అసలు సంగతి చెప్పుకొచ్చారు. మరోవైపు వరంగల్‌లో కొందరు అభిమానుల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news