రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం – సీఎం రేవంత్

-

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదివారం గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది.

CM Revanth’s 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు విజయాలు, సెమీఫైనల్స్ మాత్రమేనని.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసినప్పుడే మనం ఫైనల్స్ లో గెలిచినట్లు అని అన్నారు. 2029 ఫైనల్స్ లో మనం ఘన విజయం సాధించాలన్నారు రేవంత్. 1994 నుంచి రాష్ట్రంలో ప్రతి పార్టీ రెండుసార్లు గెలిచిందని.. కాంగ్రెస్ కూడా కచ్చితంగా వరుసగా రెండుసార్లు అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు.

వచ్చే లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో 16 పార్లమెంట్ స్థానాలు గెలిపించి ఢిల్లీకి పంపించాలని కోరారు. ప్రతి కార్యకర్తకు కొత్త టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో ఉంటారని, ఆయనకు అందరూ సహకరించాలని కోరారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news