హైదరాబాద్ నుంచి రియాద్‌కు నేరుగా విమాన సర్వీసులు

-

Hyderabad-Riyadh flights  : హైదరాబాద్ నుంచి రియాద్‌కు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు ఫిబ్రవరి 2 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు నడవనున్నాయి.

Air India Express to start direct Hyderabad-Riyadh flights

ప్రతి సోమ, బుధ శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు విమానం శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు రియాద్ చేరుకుంటుంది. అలాగే రియాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు శంషాబాద్ చేరుకుంటుంది.

ఇవాళ్టి నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది ఇలా ఉండగా, ఇవాళ ఉదయం నుంచే శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా పొగ మంచు చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి. విమానాల ఆలస్యంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news