నన్ను ఏం చేసిన పర్లేదు.. ఆ పనులను ఆపకండి..!

-

MIM పార్టీ MLA అక్బరుద్దీన్ ఒవైసీ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా సలాకం చెరువు లో కాలేజీల నిర్మాణంపై స్పందించారు అక్బరుద్దీన్. తమ కాలేజీ లపై సోషల్ మీడియాలో అసత్య వ్యాఖ్యలు చెయ్యడం పై ఆవేదన వ్యక్తం చేసాడు ఓవైసీ. తనపై దాడి చేయాలంటే చేసుకోండి కానీ నేను చేస్తున్న మంచి పనులు ఆపకండి అని విజ్ఞప్తి చేసారు.

నన్ను తుపాకితో కాలుస్తారా కాల్చండి.. చాకుతో పోడుస్తారో పొడవండి కానీ నేను చేస్తున్న మంచి పనులను ఆపకండి అని అన్నారు. ఏదైనా కోపం ఉంటే నాపై తీర్చుకోండి.. కానీ నేను ఏర్పాటు చేసిన సంస్థలపై పగా పట్టవద్దు అని కోరారు అక్బరుద్దీన్. అయితే పాతబస్తీ సలకం చెరువులో నిర్మాణాలు చేపట్టారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. సలకం చెరువులో ఓవైసీ కళాశాల నిర్మించారని అవి కూల్చాలంటూ వార్తలు వైరల్ కావడంతో అక్బరుద్దీన్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news