వాహనదారులకు అలర్ట్‌..హైదరాబాద్‌ ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు

-

ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విడిది చేయడానికి ఇవాళ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.  రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్ళించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Alert for motorists..Hyderabad traffic restrictions today

అందుకు వాహనదారులు అందరూ ట్రాఫిక్ వారికి సహకరించాలని కోరారు. అందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనాదారులకు సూచించారు. మరోవైపు బొల్లారం రాష్ట్రపతి నిలయానికి శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడంతో అక్కడి నివాసంలో దాదాపు అన్ని పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షించి పూర్తిచేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనను రద్దు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news