మద్యం ఆరోపణలపై పురంధేశ్వరికి అంబటి కౌంటర్

-

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏరులై పారుతుందని పురంధేశ్వరి పేర్కొంటున్న విషయం తెలిసిందే. వైసీపీ, బీజేపీ నేతల మధ్య మద్యం గురించి తరుచూ వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా దీనిపై ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు మాట్లాడారు. ప్రధానంగా భూం భూం బీర్ల కంపెనీకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడే అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కొత్త బ్రాండ్ లకు వైసీపీ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎక్కువగా అనుమతి ఇచ్చారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త డిస్టలరీస్ కి అనుమతి ఇవ్వలేదు. ప్రెసిడెంట్ మోడల్ సంస్థకు సైతం చంద్రబాబు నాయుడే అనుమతి ఇచ్చాడని అంబటి రాంబాబు తెలిపారు.

అదేవిధంగా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేయలేదని.. సాక్ష్యాధారాలు ఉన్నాయని చట్టబద్దంగానే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఏ న్యాయస్థానం కూడా చెప్పలేదన్నారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలులో ఉన్నారని పేర్కొన్నారు. భువనేశ్వరి అబద్దం గెలవాలని పాదయాత్ర చేస్తే అప్పుడు గెలుస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news