ఇవాళ తెలంగాణ సరిహద్దు గ్రామానికి అమిత్‌షా

-

ఇవాళ తెలంగాణ సరిహద్దు కర్ణాటకలోని గోర్ట గ్రామంలో హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. నిజాం విముక్త పోరాటంలో ఈ గ్రామస్తులు 200 మంది మరణించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గోర్ట గ్రామంలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలను ఆవిష్కరించారు.

 

తెలంగాణ నుంచి బిజెపి పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొంటారు.ఇక అటు ఏప్రిల్ 8 న తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై ప్రధాని కార్యాలయం ఆరా తీసింది. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ పునరుద్దరణ పనులకి శంఖుస్థాపన, వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవంతో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు మోడీ. అలాగే బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version