బంజారాహిల్స్‌ దారుణం..చికెన్ మోమోస్ తిన్న 20 మందికి ఫుడ్‌ పాయిజన్‌..ఓ మహిళ మృతి !

-

చికెన్‌ మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ అయిన సంఘటన హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌ చోటు చేసుకుంది. బంజారాహిల్స్ నంది నగర్ లో 20 మందికి పైగా అస్వస్థత కు గురయ్యారు. సింగాడికుంట లో ఓ వివాహిత మృతి చెందింది. వారాంతపు సంతలో మెమోస్ పెట్టారట నిర్వాహకులు. దీంతో బంజారాహిల్స్ నంది నగర్ లో 20 మందికి పైగా అస్వస్థత కు గురయ్యారు.

An incident of food poisoning after eating chicken momos took place in Banjara Hills, Hyderabad

బాధితులు…మరింత మంది పెరుగుతున్నారని సమాచారం. దీంతో ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. వందలాది మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు ఆస్పత్రుల్లో చికిత్స కూడా అందిస్తున్నారట. పలువురు ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. వారాంతపు సంత లో మెమోస్ పెట్టింది ఎవరూ.. అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version