Guvvala Balaraju: ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి

-

భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై మరోసారి దాడి జరిగింది. రెండు రోజుల కిందట ఎమ్మెల్యే బాలరాజు పై రాళ్లతో కాంగ్రెస్ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన గువ్వల బాలరాజు… నిన్న రాత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టారు. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు మరియు ఆయన అనుచరులు… గువ్వల బాలరాజుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

another attach on Guvvala Balaraj

అయితే ఇలాంటి నేపథ్యంలోనే మరోసారి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై దాడి జరిగింది. గువ్వల బాలరాజు పై మతిస్థిమితం లేని వ్యక్తి మట్టి పెల్లతో దాడి చేశాడని తెలుస్తోంది. అమ్రాబాద్ మండలంలోని కుమొరుని పల్లిలో ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news