తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజాలో నెలకొల్పిన నీరా కేఫ్ ను కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ కు అప్పగించింది. ఈ మేరకు
మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సహకరించిన ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి కల్లుగీత విభాగం అధ్యక్షులు నాగరాజు గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వం ఎక్సెజ్, పర్యాటకశాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్ ని
పర్యాటకశాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్కు బదిలీ చేసింది. ఆ భూమి టూరిజం శాఖది కావడంతో నీరాకేఫ్ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకు చెల్లించాలని పేర్కొంది. బీసీ సంక్షేమశాఖ, పర్యాటకశాఖ, రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.