షకీల్ కొడుకు రోడ్డు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్..మళ్లీ కేసు విచారణ !

-

 

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి రోడ్డు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గతంలో జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 45 జరిగిన రోడ్డు ప్రమాదం పై మళ్ళీ విచారణ జరుపనున్నారు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పాత్రపై మరోసారి విచారణ చేస్తామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రకటించారు.

Former MLA Shakeel
Twist in son’s case

జూబ్లీ హిల్స్ రోడ్ no 45లో 2022లో కారు ఢీకొట్టడంతో మహా రాష్ట్ర కు చెందిన యాచకురాలి కొడుకు మరణించాడని పోలీసులు తెలిపారు. కారులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఉన్నారని… కారు డ్రైవర్ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో దొరికిన సిసి ఫుటేజ్ పై మళ్లీ విచారణ చేపట్టనున్నారు పోలీసులు. కాగా ఈ కేసులో బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version