ఎలుకలు కొరికిన ఘటనలో మరో ట్విస్ట్‌..వైద్యుల సస్పెండ్ ఎత్తివేయాలంటూ ధర్నా

-

కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూలో ఉన్న పేషెంట్‌ను ఎలుకలు కరిచిన ఘటనలో బాధ్యులైన డాక్టర్లు, నర్స్‌ను మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ త్రివేణి సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులను సస్పెండ్ చేస్తున్నామని ఆమె ప్రకటించారు.

ICU Patient Bitten By Rats In Kamareddy Government Hospital

ఐసీయూ ఇంచార్జ్ డాక్టర్ కావ్య, ఐసీయూ జనరల్ మెడిసిన్ ఇన్‌చార్జ్ డాక్టర్ వసంత్ కుమార్, డ్యూటీ నర్స్ జి.మంజుల విధుల్లో నిర్లక్ష్యం వహించారని, అందుకే ఈ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి హాస్పిటల్ ఇదివరకు వైద్య విధాన పరిషత్‌లో ఉండగా, గతేడాది మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేసి డీఎంఈ పరిధిలోకి తీసుకొచ్చారు.

అయితే..కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసనకు దిగారు. సర్కారు తీరుకు నిరసనగా వైద్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల సస్పెండ్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తానంటోంది ప్రభుత్వ వైద్యుల సంఘం.

 

Read more RELATED
Recommended to you

Latest news