మాగంటి గోపీనాథ్ మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గోపీనాథ్ మృతి బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేశారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైందని గుర్తు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా పని చేశారని వెల్లడించారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిఅని వెల్లడించారు సీఎం చంద్రబాబు.