ఈ నెల 14న ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు!

-

గురుకుల ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులతో పాటు పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 14న ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రిక్రూట్మెంట్ పరీక్షలను TREIRB & TSLPRB నిర్వహించాయి.

Appointment documents for those selected for jobs on 14th of this month

ఇక అటు తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చ జరుపుతోంది. చర్చ అనంతరం తీర్మానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వ, ప్రతిపక్షాల వాడివేడి చర్చతో సభ అట్టుడుకుతోంది. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వ ఆలోచనను సమర్థిస్తూనే దానివల్ల ఆటో కార్మికులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ సర్కార్ దృష్టికి తీసుకెళ్లింది.

Read more RELATED
Recommended to you

Latest news