ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు వాదనలు ముగిశాయి. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సోమవా ఆర్దూమెంట్స్ విన్న జడ్జి స్వర్ణకాంత శర్మ.. మంగళవారం దర్యాప్తు సంస్థలు లాయర్ల వాదనలు విన్నారు. ఇవాళ ఇరు వైపుల వాదనలు ముగియడంతో కవిత ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా..? రాదా..? ఆసక్తి నెలకొంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత.. ఈ కేసు సవాల్ చేయడంతో పాటు బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు విచారణ జరిపిన ఢిల్లీ హైకో తాజాగా ఫైనల్ జడ్జిమెంట్ను రిజర్వ్ చేసింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో కవితది కీలక అని, కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దాని దర్యాప్తు సంస్థల వాదిస్తుండగా.. అసలు ఈ కేసు నిందితుల జాబితాలో కవిత పేరు లేదని.. ఈ కేసులో అరెస్ట్ అయి వర్లుగా మారిన నిందితులు స్టేట్మెంట్ల ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారని కవిత తరుపు లాయర్ వాదించారు.

Read more RELATED
Recommended to you

Latest news