అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్మీ జవాన్ మరణించారు. ఈ సంఘటన అస్సాంలో జరగగా… తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందారు.

Army jawan from Telangana died in Assam.

నల్గొండ జిల్లా అనుముల మండలం మదారి గూడెం కి చెందిన జవాన్ మృతి చెందడం జరిగింది. ఈ జవాన్ పేరు ఇరటి మహేష్. 24 సంవత్సరాలు అని అధికారులు. ఏడాదిన్నర కిందట అస్సాంలో ఉన్న ఆర్మీ జవాన్ గా విధులు స్వీకరించాడట మహేష్. అయితే వాతావరణం సరిగా లేకపోవడంతో… అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడట మహేష్.

 

దీంతో మహేష్ ను ఆసుపత్రికి తరలించిన తర్వాత మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆర్మీ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. అస్సాం ప్రభుత్వం మృతదేహాన్ని… తెలంగాణకు పంపించేందుకు ఏర్పాటులు కూడా చేస్తోంది. చిన్న వయసులో మహేష్ మృతి చెందడంతో… నల్గొండ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news