దుండిగల్ ఓక్లా స్కూల్ లో దారుణం.. బస్సులోంచి పడి చిన్నారి మృతి..!

-

దుండిగల్ ఓక్లా స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. ఓక్లా స్కూల్  బస్సులోంచి జారిపడి ఐదేళ్ల బాలిక  అక్కడికక్కడే మృతి చెందింది. అంతేకాదు.. కింద పడిన తరువాత  ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మహన్విత(5)  పై నుంచి వెళ్లింది స్కూల్ బస్సు. దీంతో చిన్నారి మహన్విత నుజ్జు నుజ్జు కావడం గమనార్హం.

స్టూడెంట్ మహన్విత(5) అక్కడికక్కడే మృతి చెందడంతో స్కూల్ బస్సు డ్రైవర్ ని సంఘటన స్థలం నుంచి పంపించారు స్కూల్ యాజమాన్యం.బస్సు లో నుండి జారిపడి మృతి చెందిందని తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. కేసును తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారని తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఓక్లా స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఐదేళ్ల మహన్విత మరణానికి స్కూల్ యజమాన్యం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని ఆందోళన చేశారు. కొద్ది సేపు ఆందోళన తరువాత పోలీసులు అక్కడికి వచ్చి సముదాయించారు. స్కూల్ యజమాన్యం, విద్యార్థిని తల్లిదండ్రులు చర్చలు జరిపారు.

Read more RELATED
Recommended to you

Latest news