గాంధీ ఆసుప్రతిలో జూనియర్ డాక్టర్ పై దాడి..!

-

దేశవ్యాప్తంగా రోజు రోజుకు డాక్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయి. వైద్యం అందించి ప్రాణాలు కాపాడే డాక్టర్లపై కూడా దాడులు చేస్తున్నారు. కోల్ కతాలో ఓ జూనియర్ డాక్టర్ పై దాడి.. హత్య ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా గాంధీ ఆసుపత్రిలో ఓ జూనియర్ డాక్టర్ పై దాడి జరిగింది.

దాడి చేసిన వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని సమాచారం. ప్రకాశ్ (60) అనే వ్యక్తి ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ పై ఉన్నట్టుండి ఒక్కసారిగా అకస్మాత్తుగా దాడి చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సదరు వ్యక్తికి మూర్చ వ్యాధి ఉన్నట్టు.. దాడి చేసిన సమయంలో మద్యం కూడా సేవించినట్టు తెలిపారు పోలీసులు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి విధుల్లో ఉన్న డాక్టర్లపై ఇలా దాడులు చేయడం దుర్మార్గం అన్నారు.దినిపై సమగ్ర విచారన చేపట్టి భవిష్యత్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు జూనియర్ డాక్టర్లు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version