మహిళా జర్నలిస్టులపై దాడికి యత్నం.. రెండు కార్లలో వెంబడించి ?

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో ఇద్దరూ మహిళా జర్నలిస్టులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేయడానికి TS07HB1272 కారులో వచ్చారు కాంగ్రెస్ గుండాలు. కొండారెడ్డిపల్లెలో రుణమాఫీ ఎంతమందికి జరిగిందో తెలుసుకోవడానికి వచ్చిన మామీద దాడి చేయిస్తున్నారు ఎందుకంత భయం మీకు అని ప్రశ్నించింది మహిళా జర్నలిస్టు.

మేము పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాం. మధ్యలో ఫీల్డ్ కోసం పోయి వస్తూ ఉంటే.. రెండు కార్లలో మమ్ముల్ని ఫాలో అయ్యాయి. మధ్యలో వెల్దండ పోలీస్ స్టేషన్ కి వచ్చాం. పోలీస్ స్టేషన్ లో లోపలికి వెళ్తున్నప్పుడు తమపై దాడి చేసేందుకు వచ్చాడు ఓ వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు మీ ఆడ బిడ్డను ఎవరైనా ఇలా చేస్తే.. మీరు ఊరుకుంటారా..? మీ ఇంటి ఆడబిడ్డకు ఒకరూల్.. బయటి ఆడబిడ్డకు మరో రూలా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రశ్నించిన మహిళా జర్నలిస్టులపై కూడా దాడులు చేస్తారా..? అని ప్రశ్నించారు మహిళా జర్నలిస్టు సరితా.

Read more RELATED
Recommended to you

Latest news