యువతి పై రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ల అత్యాచార యత్నం..!

-

జేఎస్ఆర్ సన్ సిటీ రియల్ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నించిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్లో నివాసం ఉంటూ మియాపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డిపార్ట్ మెంట్లో ట్రైనీగా జాయిన్ అయింది.

అయితే అదే రియల్ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు సైట్ విజిట్ కోసం అంటూ ఆ యువతిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించారు. అయితే వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి గత రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి, అక్కడి నుండి మియాపూర్ కి పంపించారు. అత్యాచార ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version