జూన్ 20న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం – మంత్రి తలసాని

-

నేడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. జూన్ 20వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. జూన్ 19న ఎదుర్కోలు ఉత్సవం, 20న అమ్మవారి కళ్యాణం, 21న రథోత్సవం జరుగుతుందని తెలిపారు.

 

అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు నగరం తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. గత సంవత్సరం అమ్మవారి కల్యాణానికి ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చారని.. ఈ సంవత్సరం 15 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news